Breaking News

కేంద్ర క్రీడాశాఖ మంత్రితో చంద్రబాబు సమావేశం..


Published on: 16 Jul 2025 15:50  IST

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఇందులో భాగంగా బుధవారం సీఎం చంద్రబాబు కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటి అయ్యారు.. ఏపిలో ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ,క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు,నేషనల్ వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి, స్టేడియమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మాణాలకు సంబంధించి విజ్ఞాపనలు అందజేశారు. అమరావతిలో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్రమంత్రిని కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి