Breaking News

ఇళ్ల తొలగింపునకు రంగం సిద్ధం


Published on: 28 Apr 2025 13:00  IST

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పరిహారం అందుకున్న ఇళ్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఇప్పటికే రెండు రోజుల క్రితం పరిహారం తీసుకున్న ఇళ్ల యజమానులు వెంటనే ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు సంబంధిత ఇంటి యజమానులకు సూచించారు.రామాలయ పరిసరాల్లో మొత్తం 41 ఇళ్లను అభివృద్ధి పనుల కోసం తొలగించాలని అధికారులు నిర్ణయించారు.

Follow us on , &

ఇవీ చదవండి