Breaking News

కూటమి ఖాతాలో రెండు మేయర్ స్థానాలు.


Published on: 28 Apr 2025 14:01  IST

విశాఖపట్నం మేయర్ స్థానం కూటమి ప్రభుత్వం సొంతం చేసుకుంది. కూటమి అభ్యర్ధి పీలా శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పీలా శ్రీనివాస్‌ను మేయర్ అభ్యర్ధిగా జనసేన పార్టీ ప్రతిపాదించగా..బీజేపీ బలపర్చింది. దీంతో ఎన్నిక ప్రారంభమైన 10నిమిషాల్లోనే మేయర్‌‌ పేరును అధికారికంగా ప్రకటించారు.అటు గుంటూరు మేయర్ స్థానాన్ని కూడా కూటమి పార్టీ దక్కించుకుంది. గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు.

Follow us on , &

ఇవీ చదవండి