Breaking News

కాళేశ్వరం ఈఎన్‌సీ హరీరామ్‌ను కస్టడీ కోరిన ఏసీబీ


Published on: 29 Apr 2025 17:22  IST

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఈఎన్‌సీ భూక్యా హరిరామ్‌ కూడబెట్టిన ఆస్తుల విలువ రూ.200 కోట్ల పైమాటేనని అయితే,తన బినామీల గుట్టును హరిరామ్‌ బయటపెట్టలేదని సమాచారం. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఏసీబీ భావిస్తోంది. హరిరామ్‌ను శనివారం అదుపులోకి తీసుకున్న అధికారులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు న్యాయమూర్తి ఇంట్లో హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీ విధించగా హరిరామ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి