Breaking News

రాజధాని సభకు బొట్టుపెట్టి ఆహ్వానం


Published on: 30 Apr 2025 11:37  IST

అమరావతి పనుల పునఃప్రారంభ సభకు రాజధాని రైతులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. వంశపారంపర్యంగా వచ్చిన భూములను రాష్ట్ర హితం కోసం రాజధాని నిర్మాణానికి త్యాగం చేసిన రైతులను తగిన రీతిలో గౌరవిస్తోంది. గత వైకాపా హయాంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న వీరికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధాని మోదీ పాల్గొనే సభకు కుటుంబ సమేతంగా రావాలంటూ భూములిచ్చిన రైతుల ఇంటికెళ్లి మరీ సీఆర్డీఏ సిబ్బంది ప్రత్యేక ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. ఈ పత్రికలపై ‘అమరావతి రైతు’ అని ముద్రించారు.

Follow us on , &

ఇవీ చదవండి