Breaking News

పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల


Published on: 30 Apr 2025 14:59  IST

తెలంగాణ లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2.15 గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రవీంద్రభారతి లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను ఆయన రిలీజ్ చేశారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 92.78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గురుకులాల్లో 96 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. గత ఏడాదితో పోలిస్తే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదు అయ్యింది. బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత పొందారు.

Follow us on , &

ఇవీ చదవండి