Breaking News

సునీతపై వివేకా హత్య కేసు సంచలన ఆరోపణలు


Published on: 31 Oct 2025 15:12  IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో నిందితులు కౌంటర్లు దాఖలు చేశారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి చేసిన వినతిని తిరస్కరించాలని కోరుతూ కోర్టులో నిందితులు కౌంటర్ వేశారు. సునీత దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని, తదుపరి దర్యాప్తు కోరడం వెనుక వ్యక్తిగత, రాజకీయ ఎజెండా రెండూ ఉన్నాయని నిందితులు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి