Breaking News

పంజాబ్‌లో కబడ్డీ ప్లేయర్‌ కాల్చివేత


Published on: 05 Nov 2025 15:26  IST

పంజాబ్‌లోని లుథియానాలో ఓ కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. లుథియానా జిల్లాలోని సమ్రాలా బ్లాక్‌లో కబడ్డీ ఆటగాడు గుర్వీందర్‌ సింగ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అన్మోల్‌ బిష్ణోయ్‌ పేరిట సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. గుర్వీందర్‌ సింగ్‌ను తమ గ్యాంగ్‌కు చెందిన కరణ్, తేజ్ చక్ అనే వ్యక్తులు హత్య చేసినట్లే అందులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి