Breaking News

స్థానికులపైకి దూసుకెళ్లిన లారీ.. స్పాట్‌లోనే


Published on: 11 Nov 2025 17:14  IST

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు (మంగళవారం) నగరంలోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై చేపల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ స్థానికులపై దూసుకెళ్లింది. అలాగే టాటా ఏస్ వాహనం, మూడు బైకులు ఢీ కొట్టిన లారీ ఆపై చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి