Breaking News

పంజాబ్‌లో పాకిస్తాన్ డ్రోన్ దాడి.. ముగ్గురికి గాయాలు..


Published on: 10 May 2025 09:07  IST

భారత త్రివిధ దళాలు పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. పాక్ కూడా భారత్‌ను దెబ్బ తీయడానికి విశ్వప్రయత్నం చేస్తూనే ఉంది. మిస్సైల్, డ్రోన్ దాడులకు యత్నిస్తోంది. అయితే, నిన్న పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్‌లు దాడులకు యత్నించాయి. వాటిలో చాలా వాటిని భారత ఆర్మీ పేల్చేసింది. కానీ, ఓ పాకిస్తాన్ డ్రోన్ మాత్రం శుక్రవారం ఫిరోజాబాద్‌లోని ఇళ్లపై పేలింది.ఈ సంఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి