Breaking News

బీఎల్‌ఏ మెరుపు దాడులు.. పాక్ ఉక్కిరిబిక్కిరి


Published on: 10 May 2025 16:28  IST

పాక్ ఆర్మీపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) విరుచుకుపడింది. మొత్తం 39 చోట్ల బీఎల్‌ఏ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్థాన్ సైనిక స్థావరాలు, గ్యాస్ పైప్‌లైన్లు, ప్రధాన రహదారులు లక్ష్యంగా మారినట్లు సమాచారం. బలూచిస్థాన్‌లోని కాలాత్ జిల్లాలోని మాంగోచర్ పట్టణాన్ని బీఎల్‌ఏ ప్రత్యేక బృందం 'ఫతే స్క్వాడ్'‌ను స్వాధీనం చేసుకుంది. మరోవైపు కచ్చి జిల్లాలో జరిగిన రోడ్‌సైడ్ బాంబు దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా బలూచిస్థాన్‌లో హింస పెరుగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి