Breaking News

పాక్‌కు అంత సీన్‌ లేదు..


Published on: 10 May 2025 22:25  IST

దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్‌ 2025 సీజన్‌ను తాత్కాలికంగా వాయిదా వేసింది. భారత క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. టోర్నీ కీలక దశలో ఉన్నప్పటికీ, త్వరలోనే పునఃప్రారంభమవుతుందని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తెలిపారు. “పాక్‌ ఒత్తిడిని ఎక్కువ కాలం తట్టుకోలేదు, ఐపీఎల్‌ పూర్తవడం ఖాయం” అని వ్యాఖ్యానించారు. భద్రత ముందస్తు చర్యగా.. అభిమానుల కోసం శాంతి స్థిరమైన వాతావరణంలోనే మళ్లీ క్రికెట్ హంగామా మొదలవుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి