Breaking News

మురళీనాయక్‌కు నివాళులర్పించిన మంత్రులు


Published on: 11 May 2025 09:19  IST

దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు మంత్రులు నారా లోకేశ్‌, అనగాని సత్యప్రసాద్‌, అనిత నివాళులర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి జవాను భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. మురళీనాయక్‌ తల్లిదండ్రులను మంత్రులు ఓదార్చారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని లోకేశ్‌ భరోసా ఇచ్చారు. వీరితో పాటు ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, కందికుంట ప్రసాద్‌ తదితరులు జవాను భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి