Breaking News

హైవేపై కూల్ డ్రింక్స్‌ వ్యాన్ బోల్తా… క్లియర్ చేసేలోపే..


Published on: 13 May 2025 16:57  IST

కూల్‌డ్రింక్స్‌ లోడ్‌లో ఓ వాహనం విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుండగా టైర్‌ పేలడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదంలో వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఆ వాహనంలో ఉన్న కూల్‌డ్రింక్‌ కేసులు మొత్తం రోడ్డుపై పడిపోయాయి. దాన్ని గమనించిన స్థానిక వాహనదారులు.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను హాస్పిటల్‌కు తరలించాల్సింది పోయి..రోడ్డుపై పడిఉన్న కూల్‌డ్రింక్స్‌ను ఎత్తుకెళ్లే పనిలో పడ్డారు. ఇదే అదునుగా చూసుకొని అందినకాడికి కూల్‌డ్రింక్‌ కేస్‌లను తీసుకొని వెళ్లిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి