Breaking News

12.17 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్‌


Published on: 03 Jan 2026 13:45  IST

గండిపేట మండలం గంధంగూడ గ్రామంలో 12.17 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా శుక్రవారం కాపాడింది. సర్వే నంబర్‌ 43లో ఉన్న భూమి మున్ముందు కబ్జాకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్‌ వేసింది. ఇదే సర్వే నెంబర్‌లో 26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. ఎకరా భూమిని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, మరో 9 ఎకరాలను జీహెచ్‌ఎంసీ డంపింగ్‌ యార్డు కోసం ప్రభుత్వం కేటాయించింది.కేటాయింపులు పోను మిగిలిన భూమి క్రమేణా కబ్జా అవుతోందని స్థానికులకు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి