Breaking News

వైసీపీలో చీలిక ఖాయంగా కనిపిస్తోంది


Published on: 09 Jan 2026 11:00  IST

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసిన అంశాన్ని అసెంబ్లీ నైతిక విలువల కమిటీ పరిశీలించి, వెలుగులోకి తీసుకురావడంతో వారి బూట కపు చర్యలు బయటపడ్డాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ‘జగన్‌ అసెంబ్లీ కార్యకలాపాలను పూర్తిగా బహిష్కరి స్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌కు తెలియకుండా రిజిస్టర్‌లో సంతకాలు చేశారు. ఈ పరిణామాలు వైసీపీ చీలికకు దారితీయవచ్చు’ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి