Breaking News

పెళ్లయిన రెండో రోజే.. కరెంట్ షాక్‌తో..?


Published on: 20 May 2025 17:10  IST

కొడుకుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి మురిసిపోయారు ఆ తల్లిదండ్రులు. కానీ విధికి ఆ కొత్త జంటను చూసి కన్ను కుట్టిందో ఏమో నవ వరుడ్ని కరెంట్ షాక్ రూపంలో కాటేసింది. భర్త మరణంతో మరణంతో మానసిక ఆవేదనకు గురై.. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వధువు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మహబూబాబాద్ జిల్లాలో పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన రెండో రోజే విద్యుత్ షాక్‌తో నవవరుడు మృతిచెందాడు. బయ్యారం మండలం గౌరారం శివారు కోడిపుంజుల తండాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి