Breaking News

అరకులో భయంతో పరుగులు తీసిన పర్యాటకులు..?


Published on: 26 May 2025 16:48  IST

అరకు లోయలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. బొర్రా గుహలు, ట్రైబల్ మ్యూజియం, చాపరాయితోపాటు.. పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ కు సందర్శకులు భారీగా పెరిగారు. అందరూ ఎవరి ఎంజాయ్‌మెంట్లో వాళ్ళు ఉన్నారు. అయితే పద్మాపురం గార్డెన్స్‌లో.. ఒక్కసారిగా అలజడి రేగింది. భయంతో పర్యాటకులు పరుగులు తీస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. చివరకు.. అక్కడ ఓ భారీ నాగుపాము కనిపించినట్టు చెప్పారు కొంతమంది టూరిస్టులు.

Follow us on , &

ఇవీ చదవండి