Breaking News

ఒకే కేసు..ఒకే రోజు..తప్పుకొన్న ముగ్గురు న్యాయమూర్తులు


Published on: 29 May 2025 11:43  IST

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ల విచారణ నుంచి ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు తప్పుకున్న అరుదైన సంఘటనకు తెలంగాణ హైకోర్టు వేదిక అయింది. సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్‌ చేయాలంటూ దోషులు బి.వి.శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, ఓఎంసీ కంపెనీ, మెఫజ్‌అలీఖాన్, వి.డి.రాజగోపాల్‌లు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. దోషులందరూ శిక్షను సస్పెండ్‌ చేసి బెయిలు మంజూరు చేయాలని కోరగా, గాలి జనార్దన్‌రెడ్డి శిక్షను రద్దు చేయాలంటూ అప్పీలు దాఖలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి