Breaking News

స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలి


Published on: 24 Jun 2025 16:03  IST

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివాస్‌ కార్యక్రమం బీజేపీ డివిజన్‌ అధ్యక్షుడు గడ్డం సతీష్ గౌడ్‌ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలో ఆయన చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ స్ఫూర్తితో కార్యకర్తలు పనిచేయాలన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి