Breaking News

ఆ రహదారిలో పులి తిరుగుతోంది.. జాగ్రత్త..


Published on: 28 Jun 2025 14:55  IST

కర్ణాటక రాష్ట్రంలోని సండూరు తాలుకా యశ్వంత్‌నగర నుంచి గరగా నాగలాపురం గ్రామ మార్గంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు మార్గంలో వంతెనపై పులి కనిపించింది. నాగలాపురం వెళ్లే వారు రోడ్డు పక్కనే పులి కనిపించడంతో పరుగులు తీశారు. అటవీ ప్రాంతం ఉండటంతో కొద్దిపాటి వర్షం కురుస్తుండటంతో అడవుల్లో ఉన్న ఎలుగుబంట్లు, పులులు తరచుగా కనిపిస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. రోడ్డు పక్కన కంచెలు ఏర్పాటు చేయాలని ఫారెస్టు అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి