Breaking News

విద్యుత్ ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి


Published on: 01 Jul 2025 18:47  IST

విద్యుత్ ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్తలు విధిగా తీసుకొని ముందుకు సాగాలని సైబర్ సిటీ సర్కిల్ ఎస్‌ఈ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం ఇబ్రహీంబాద్ విద్యుత్ డివిజన్ పరిధిలోని నిక్నాపూర్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ భద్రత వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లైన్ క్లియర్ పొందిన తర్వాతనే పని చేయాలన్నారు. హెల్మెట్, సేఫ్టీ బెల్ట్ పెట్టుకుని పని చేయాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి