Breaking News

బ్లడ్‌మనీకి అంగీకరించం..నిమిషకు శిక్ష పడాల్సిందే


Published on: 16 Jul 2025 15:32  IST

కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు అమలుకావాల్సిన ఆమె మరణ శిక్షను యెమెన్‌ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో కాస్త ఊరట లభించింది. అయితే మృతుడు తలాల్‌ అదిబ్‌ మెహది కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది.నేరానికి క్షమాపణ ఉండదని మృతుడు సోదరుడు అబ్దుల్‌ ఫత్తా మెహది స్పష్టంచేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్‌మనీకి అంగీకరించబోమని వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి