Breaking News

ఫ్యాక్షన్ బాధిత కుటుంబానికి మంత్రి లోకేష్ అండ


Published on: 17 Jul 2025 17:34  IST

ఫ్యాక్షన్ బారిన పడి సర్వం కోల్పోయిన కుటుంబానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. రాయలసీమలో బోయ నరసింహులు కుటుంబం ఫ్యాక్షన్‌ భూతానికి బలి అయ్యింది. ప్రత్యర్థుల చేతుల్లో బోయ నరసింహులు సహా ముగ్గురు కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో బోయ నరసింహులు కుటుంబాన్ని మంత్రి లోకేష్.. ఉండవల్లి నివాసానికి పిలుపించుకుని మాట్లాడారు. కుటుంబానికి అండగా ఉంటానని, అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి