Breaking News

15 వేల ఎన్‌కౌంటర్లు.. 238 మంది హతం


Published on: 18 Jul 2025 11:18  IST

శాంతిభద్రతలు గాడితప్పుతూ.. గూండారాజ్‌ కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులను ‘బుల్లెట్‌ రాజ్‌’తో అదుపులోకి తీసుకువచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. 2017లో యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి ఇప్పటి వరకు మొత్తం 14,973 ఎన్‌కౌంటర్లు జరగ్గా.. 238 మంది మృతిచెందారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లలో 9,467 మంది నేరగాళ్లకు గాయాలవ్వగా.. 30,694 మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ అరెస్టయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి