Breaking News

షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్‌పై నిషేధం


Published on: 28 Apr 2025 14:37  IST

కశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇప్పటికే ఇండియాలో ఉన్న పాకిస్తాన్ పౌరులను వారి దేశానికి ఏప్రిల్ 27లోగా వెళ్లాలని ఆదేశించింది. దీంతోపాటు ఆ దేశ పౌరులకు వీసాలను కూడా రద్దు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా పాకిస్తాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానెళ్లపై భారత్ నిషేధం విధించింది. బ్యాన్ చేసిన వాటిలో మాజీ ప్రముఖ క్రికెటర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్‌ సహా పాకిస్తాన్ మీడియాకు చెందిన పలు ఛానెళ్లు ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి