Breaking News

చేసేది పోలీస్ జాబ్.. ఉన్నది మాత్రం దొంగబుద్ది..


Published on: 31 Oct 2025 15:15  IST

సతీష్‌ కుమార్‌(67) అనే వ్యక్తి, తన భార్య శిల్పా, కుమార్తెతో కలిసి హైప్రొఫైల్‌ మోసం కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిపై నగరంలోని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే అక్టోబర్‌ 23న మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు ట్రాన్సిట్‌లో ఉన్న సమయంలో సతీష్‌ పరారయ్యాడు. ఈ పరిణామంతో పోలీసులు అప్రమత్తమై, మొత్తం టాస్క్‌ ఫోర్స్‌ బృందాన్ని మళ్లీ నిందితుడి కోసం శోధనకు పంపారు. సతీష్‌ రూ.23 కోట్ల మోసానికి పాల్పడి, పెట్టుబడిదారులను మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి