Breaking News

పాండురంగ స్వామి ఉత్సవాలు..


Published on: 31 Oct 2025 17:46  IST

జిల్లాలోని మచిలీపట్నంలో చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి (శుక్రవారం) నుంచి ఆరు రోజుల పాటు స్వామి వారి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర సతీసమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి మేళతాళాలు, పూర్ణ కుంభంతో ఉత్సవ కమిటీ స్వాగతం పలికింది. ఆపై స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి