Breaking News

చేవెళ్ల బస్సు ప్రమాదం.. సీఎం రేవంత్ ఆదేశాలు..


Published on: 03 Nov 2025 12:34  IST

చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్​‌కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని డీజీపీలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి