Breaking News

అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులు


Published on: 03 Nov 2025 18:50  IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో వికారాబాద్‌ జిల్లా యాలాల్‌ మండలం హాజీపూర్‌కు చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మీ మృతి చెందారు. వారి పిల్లలు భవానీ, శివలీల ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనస్థలిలో నిర్జీవంగా పడివున్న తమ తల్లిదండ్రులను చూసుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

Follow us on , &

ఇవీ చదవండి