Breaking News

ఇంటి నుంచే ఓటింగ్‌.. నేడు ప్రారంభం


Published on: 04 Nov 2025 12:29  IST

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో వయోధికులు, దివ్యాంగులకు హోం ఓటింగ్‌ నేడు ప్రారంభం కానుంది. అధికారుల బృందం ఇళ్ల వద్దకు వెళ్లి వారు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనుంది. 85 ఏళ్లు దాటిన, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఈ సదుపాయం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈ నేపథ్యంలో 84 మంది వయోధికులు, 19 మంది దివ్యాంగులు ఫారం-21లో ఇంటి వద్ద ఓటు వేసే అవకాశం కోసం దరఖాస్తు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి