Breaking News

అడవి పందిని వేటాడేందుకు వెళ్లాడు..కట్ చేస్తే..


Published on: 04 Nov 2025 15:24  IST

అడవి పందులను వేటాడేందుకు ఉచ్చుగా అమర్చిన విద్యుత్ తీగలు గోవింద స్వామి, కుట్టి అనే ఇద్దరికి తాకాయి. అడవిలో వేటాడేందుకు వెళ్లి విద్యుత్ తీగ తగలడంతో వాళ్లిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరితో పాటు అడవి పంది కూడా మృతి చెందగా.. ఆవులు మేపేందుకు వెళ్లిన వాళ్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి