Breaking News

సత్యసాయి శత జయంతికి 200 ప్రత్యేక బస్సులు


Published on: 05 Nov 2025 12:09  IST

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్‌ ఆర్టీసీ 200 ప్రత్యేక బస్సులు నడుపుతుందని ఆ సంస్థ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి మంగళవారం వచ్చిన ఆయన, ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు ప్రతినిధులతో శత జయంతి ఏర్పాట్ల గురించి చర్చించారు. పుట్టపర్తి ఆర్టీసీ డిపో, బస్టాండును అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి