Breaking News

కూటమి బలం మరింత పెరుగుతోంది..


Published on: 05 Nov 2025 15:17  IST

కూటమి బలం క్రమంగా మరింత పెరుగుతోందని.. జగన్‌ బలం తగ్గుతోందని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం కేసుల్లో అనేక మంది వైకాపా నేతలు ఇరుక్కున్నారన్నారు. ఇటీవల జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా బలం బాగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. తాము జగన్‌కు చెక్ పెట్టబోతున్నామన్నారు. ఆయనకు అధోగతి తప్పదని.. ప్రజలే ఛీకొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి