Breaking News

భారత ‘యాపిల్‌’ ఇక అమెరికాకే


Published on: 05 May 2025 12:18  IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌ల కారణంగా ఆ దేశ మార్కెట్‌ను భారత్‌ తయారీ యాపిల్‌ ఫోన్లు ఆక్రమించనున్నాయి. ఈ ఏడాది జూన్‌ త్రైమాసికం నాటికి భారత్‌లోని ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌ ఫ్యాక్టరీల నుంచి కనీసం 12 -14 బిలియన్‌ డాలర్ల ఫోన్లను అక్కడికి ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ త్రైమాసికం తర్వాత కూడా ఇదే స్థాయిలో ఎగుమతులు చేయగలిగితే 2026 ఆర్థిక సంవత్సరానికి 40 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్లు భారత్‌ ఎగుమతి చేసినట్లు అవుతుంది. మన దేశంలో తయారయ్యే 100 యాపిల్‌ ఫోన్లలో 80 ఫోన్లు అమెరికాకే చేరనున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి