Breaking News

చెత్త ఎవరిదో .. సత్తా ఎవరిదో తేల్చుకుందాం


Published on: 05 Nov 2025 18:01  IST

భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్‌లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ నివేదిక విడుదల చేశారు. ‘జూబ్లీహిల్స్‌ ప్రగతి నివేదిక’ పేరిట తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ అభివృద్ధికి మా పార్టీ ఏం చేసిందో.. రెండేళ్ల కాంగ్రెస్‌ ఏం చేసిందో చర్చకు రేవంత్‌ సిద్ధమా..? చెత్త ఎవరిదో.. సత్తా ఎవరిదో తేల్చుకుందాం.. చర్చకు రావాలి. ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం అని కేటీఆర్‌ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి