Breaking News

చెప్పిందే.. చేసింది.. ఆర్మీ వీడియో వైరల్


Published on: 07 May 2025 11:34  IST

ఆపరేషన్‌ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోకి ఉగ్రమూకపై విరుచుకుపడుతోంది. కాగా ఈ దాడులకు కొద్దిసేపటి ముందు ఇండియన్‌ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. ‘‘విజయం కోసం సాధన.. దాడికి సిద్ధం..!’’ అని అని పేర్కొంటూ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై భారతీయుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘భారత్ చెప్పిందే.. చేసింది.. సరిగ్గా బుద్ధి చెప్పింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి