Breaking News

ఆపరేషన్ సింధూర్‌పై చైనా రియాక్షన్.


Published on: 07 May 2025 11:46  IST

పాకిస్తాన్‌కు సన్నిహిత మిత్రదేశమైన చైనా భారత్‌తోనూ సరిహద్దులు పంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం వేకువజామున భారత ఆర్మీ  చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై  చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. భారత్, పాకిస్తాన్ రెండూ శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సంయమనం పాటించాలని సూచించారు. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను తీసుకోకుండా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి