Breaking News

అప్పుడు బాలాకోట్‌.. ఇప్పుడు ఆపరేషన్‌ సిందూర్‌.


Published on: 07 May 2025 12:16  IST

భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ చర్యపై యావత్‌ భారతదేశం హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తోంది. దాయాదిని ఏమార్చి.. అత్యంత పకడ్బంధీగా దాడుల ప్రణాళికలను భారత్‌ అమలుచేసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి. బాలాకోట్‌ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలనే ప్రధాని అమలుచేశారు. దాడులకు ముందు ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదిని మరోసారి ఏమార్చారు. ఈ దాడులతో పాక్‌ షాక్‌కు గురికాక తప్పలేదు.

Follow us on , &

ఇవీ చదవండి