Breaking News

అయ్యో.. అయ్యప్పా.. మాల విరమణ చేసి వస్తుంటే


Published on: 26 Nov 2025 16:37  IST

తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో విషాదం నెలకొంది. బుధవారం ఉదయం తమిళనాడులోని రామనాథపురం మెడికల్ కాలేజ్ సమీపం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లాలోని పలాస మండలానికి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందగా.. మరో నలుగురు అయ్యప్ప భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పలాస మండలం వీర రామచంద్రపురం గ్రామానికి చెందిన పైడిరాజు (25),పెదంచల గ్రామానికి చెందిన ఇల్లాల నవీన్(26) గా గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి