Breaking News

సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్‌


Published on: 09 May 2025 07:30  IST

పహల్గాం ఉగ్రదాడికి భారత ప్రతీకారంగా 'ఆపరేషన్‌ సిందూర్‌' చేపట్టిన నేపథ్యంలో పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు కఠిన భద్రతా చర్యలు తీసుకున్నాయి. పాఠశాలలు మూసివేయడంతో పాటు పోలీసు అధికారుల సెలవులు రద్దు చేశారు. పంజాబ్‌లోని ఆరు సరిహద్దు జిల్లాల్లో పాఠశాలలు, కార్యక్రమాలు రద్దు కాగా, రాజస్థాన్‌లోనూ నాలుగు జిల్లాల్లో బడులు మూసివేశారు. జోధ్‌పుర్‌, బీకానేర్‌, కిషన్‌ఘర్‌ విమానాశ్రయాలు మే 9 వరకు మూతపడ్డాయి.

Follow us on , &

ఇవీ చదవండి