Breaking News

వెళ్లొస్తా చిన్నా.. దేశసేవే మిన్న!


Published on: 09 May 2025 07:32  IST

ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో పారా మిలిటరీ బలగాల సెలవులు రద్దవ్వడంతో వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన నాయక్‌ అయిల మహేశ్‌గౌడ్‌ సెలవుల మధ్యలోనే తిరుగు పయనమయ్యారు. అస్సాంలో విధులు నిర్వహిస్తున్న మహేశ్‌గౌడ్‌ ఏప్రిల్‌ 19 నుంచి సెలవులో ఉన్నారు. ఇంకా 10 రోజులు మిగిలి ఉండగానే గురువారం ఆయన తిరిగి సేవలో చేరేందుకు బయలుదేరారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆయన భార్య లావణ్య, కుమార్తెలు విస్తృత, ప్రియాన్షి సెల్యూట్‌ చేసి ధైర్యం నూరిపోసి వీడ్కోలు పలికారు.

Follow us on , &

ఇవీ చదవండి