Breaking News

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి: చైనా


Published on: 09 May 2025 12:16  IST

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణలపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ, ఉగ్రవాదం ఏ రూపమైనా వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. శాంతి, స్థిరత్వం కోసం భారత్‌, పాక్‌ దేశాలు అంతర్జాతీయ చట్టాలను పాటించాలన్నారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా సంయమనం పాటించాలని సూచించారు. అంతర్జాతీయ సమాజంతో కలిసి పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు చైనా సిద్ధంగా ఉందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి