Breaking News

మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు కానిస్టేబుళ్ల మృతి


Published on: 09 May 2025 15:26  IST

మావోయిస్టు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుళ్ల మృతదేహాలను హెలికాప్టర్‌లో వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు అధికారులు. పోస్టుమార్టం తర్వాత వారి మృతదేహాలను పోలీసు హెడ్‌క్వార్టర్‌కు తీసుకెళ్లారు. అక్కడ అమరులైన కానిస్టేబుళ్లకు మంత్రి సీతక్క, డీజీపీ జితేందర్ నివాళులర్పించారు. వీరితో పాటు వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, ములుగు ఎస్పీ శబరీష్, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఆ తర్వాత కానిస్టేబుళ్ల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.

Follow us on , &

ఇవీ చదవండి