Breaking News

రూ. 5 లక్షలు.. 15 రోజులు


Published on: 09 May 2025 17:16  IST

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని రూ.5 లక్షల బడ్జెట్‌లో కొత్త పద్ధతుల్లో నిర్మించడానికి వివిధ ఏజెన్సీలు ఆసక్తి చూపుతున్నాయి. అతి తక్కువ సమయంలో.. ప్రభుత్వం అందించే నిధులతోనే పేదలకు నాణ్యమైన ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. హౌసింగ్‌ కార్పొరేషన్‌ సూచనలతో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఓ స్టార్టప్‌ కంపెనీ 400 చదరపు అడుగుల్లో నమూనా ఇంటిని నిర్మించింది. 15 రోజుల్లోనే రూ.5 లక్షలలోపు ఖర్చుతో షీర్‌వాల్‌ పద్ధతిలో ఈ ఇంటి నిర్మాణం పూర్తిచేసినట్లు వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి