Breaking News

ఎమ్మెల్యే వస్తేనే తాళి కడతా..!


Published on: 09 May 2025 18:40  IST

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో వినూత్న ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్త సాయికుమార్, తన పెళ్లికి ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వస్తేనే తాళి కడతానని మొండికేసి కూర్చుండిపోయాడు. శుక్రవారం ఉదయం 9.05కి ముహూర్తం ఉండగా, విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పార్టీ కార్యకర్త కోరికను గౌరవించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గెలిచినప్పుడు సాయికుమార్ పాదయాత్ర చేసిన విషయాన్ని గ్రామస్తులు గుర్తు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి