Breaking News

తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు.. ముగ్గురు మృతి


Published on: 10 May 2025 10:06  IST

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ(శనివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి.బాపట్ల జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద గ్రానైట్ లారీ బోల్తా పడింది. లారీలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు మృతిచెందారు. మృతులు పాలపర్తి శ్రీను(25), తాళ్లూరి ప్రభుదాస్(37), తమ్ములూరి సురేంద్ర (26 )గా గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి