Breaking News

జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ డ్రోన్‌ దాడులు?


Published on: 10 May 2025 22:23  IST

కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం కూడా పాక్‌ డ్రోన్‌ దాడులకు పాల్పడుతోంది. జమ్మూ కశ్మీర్‌ ఉధంపుర్‌, శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపించాయని సీఎం ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. పోఖ్రాన్‌, శ్రీనగర్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ సమీపాల్లో డ్రోన్లు కూల్చివేశారు. పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లో పలు ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ అమలు చేస్తున్నారు. గుజరాత్‌ కచ్‌ జిల్లాలోనూ డ్రోన్లు కనిపించాయని హోంమంత్రి హర్ష్‌ సంఘవి తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.

Follow us on , &

ఇవీ చదవండి