Breaking News

గ్రీష్మ కోసం గాలింపు..


Published on: 02 Jan 2026 15:05  IST

ఎండీఎంఏ కేసులో కొత్తగా తెరపైకి మరో ఇంజినీరింగ్‌ విద్యార్థిని గ్రీష్మ పేరు బయటకు వచ్చింది. ఈమె నుంచి డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు ఈ కేసులో తాజాగా అరెస్టు అయిన మహేష్‌ వెల్లడించాడు. దీంతో పోలీసులు గ్రీష్మ కోసం బెంగళూరులో ప్రత్యేక బృందంతో గాలిస్తున్నారు. మహేష్‌ అరెస్టు తర్వాత ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. మత్తు మందు సరఫరా మూలాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి