Breaking News

ఉగ్రవాదంపై భారత్‌ భారీ కౌంటర్‌


Published on: 12 May 2025 21:35  IST

ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ఉగ్రవాదాన్ని నాశనం చేసేందుకు భారత్‌ కఠిన చర్యలు తీసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. భారత మహిళల సింధూరానికి భంగం కలిగించేవారికి గుణపాఠం చెప్పామని పేర్కొన్నారు. బహావల్పూర్‌, మురుద్కే వంటి తీవ్రవాద స్థావరాలపై మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేశారు. పాక్‌ మిసైళ్లను ధ్వంసం చేసి, విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని తీసుకువచ్చారు. భారత్‌ చర్యలతో బెంబేలెత్తిన పాకిస్థాన్‌ కాల్పుల విరమణ కోసం ప్రపంచాన్ని వేడుకున్నదని వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి